BCCI: 'నో ఫ్లై జోన్'గా వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ జరుగుతున్న ప్రాంతం

  • విమానాలు ఎగరకుండా నిషేధం
  • బీసీసీఐకి తెలిపిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు
  • కాసేపట్లో ప్రారంభంకానున్న తొలి సెమీఫైనల్స్ మ్యాచ్

మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ లో కాసేపట్లో ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీఫైనల్స్ మ్యాచ్ ప్రారంభంకాబోతోంది. ఈ నేపథ్యంలో, ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. ఆ ప్రాంతంపై విమానాలు ఎగరకుండా నిషేధం విధించారు. ఈ విషయాన్ని బీసీసీఐకి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈరోజు ఎయిర్ స్పేస్ ను మూసివేస్తున్నట్టు వెల్లడించింది. శనివారం శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా ఓ ఎయిర్ క్రాఫ్ట్ స్టేడియంపై చక్కర్లు కొట్టింది. జస్టిస్ ఫర్ కశ్మీర్, స్టాప్ మాబ్ లించింగ్ అనే బ్యానర్లను ప్రదర్శించింది. ఈ ఘటన పట్ల బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో, ఈరోజు మ్యాచ్ జరుగుతున్న ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించారు.

  • Loading...

More Telugu News