Sandeep Kishan: ఈ కథలో వున్న కొత్తదనం అదే: హీరో సందీప్ కిషన్

  • ఇది కేవలం హారర్ మూవీ కాదు 
  • కథ పాతికేళ్ల ముందుకు వెళుతుంది 
  • హిట్ ఖాయమంటోన్న సందీప్ కిషన్  

సందీప్ కిషన్ కథానాయకుడిగా 'నిను వీడని నీడను నేనే' సినిమా రూపొందింది. ఈ సినిమాకి ఆయనే నిర్మాతగా వ్యవహరించాడు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ .. "ఈ సినిమా చూసిన వాళ్లెవరూ ఇదొక హారర్ మూవీ అని చెప్పరు. ఇదొక జానర్ షిఫ్టింగ్ సినిమా.

కథ ఒక పాతిక సంవత్సరాలు ముందుకువెళ్లి, అక్కడి నుంచి మళ్లీ వెనక్కి వస్తుంది. పాతిక సంవత్సరాల తరువాత ప్రపంచం ఎలా ఉంటుందనేది చూపించడమే ఈ సినిమా ప్రత్యేకత. డబ్బింగ్ చెప్పిన తరువాత చిన్మయి .. రీ రికార్డింగ్ తరువాత తమన్ నాకు కాల్ చేశారు. 'కొత్తదనం కలిగిన సినిమా చేశావు .. తప్పకుండా హిట్ అవుతుంది .. నో డౌట్' అని చెప్పారు. నేను కూడా అదే నమ్మకంతో వున్నాను" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News