Narasimhan: నేడు గవర్నర్ నరసింహన్ తో భేటీ కానున్న జగన్

  • ఈరోజు విజయవాడకు రానున్న నరసింహన్
  • గంటసేపు గవర్నర్ తో జగన్ భేటీ
  • పలు అంశాలపై జరగనున్న చర్చ

ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు భేటీ కానున్నారు. నరసింహన్ ఈరోజు విజయవాడకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన బస చేసే హోటల్ కు వెళ్లి... ఆయనను మర్యాదపూర్వకంగా జగన్ కలుసుకుంటారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వీరిరువురు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.  

More Telugu News