Mahesh Babu: కశ్మీర్ లో మహేశ్.. ఆర్మీకి చెందిన సన్నివేశాల చిత్రీకరణ

  • తదుపరి సినిమాతో మహేశ్ బాబు బిజీ
  • కశ్మీర్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ
  • కీలకమైన పాత్రలో విజయశాంతి 

మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' రూపొందుతోంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో మహేశ్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే విషయం తెలిసిందే. ఇటీవలే రెగ్యులర్ షూటింగు మొదలైంది.

మహేశ్ బాబు తదితరులపై అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. చాలా కాలం తరువాత ఈ సినిమా ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకిగాను ఆమె 3 కోట్లు పారితోషికం అందుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 'మహర్షి' వంటి భారీ హిట్ తరువాత మహేశ్ బాబు చేస్తోన్న సినిమా కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

More Telugu News