Mahbubnagar District: మానసిక వికలాంగురాలిని ఎత్తుకెళ్లి.. దారుణం

  • మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన
  • బయట నిద్రిస్తున్న మానసిక వికలాంగురాలిని ఎత్తుకెళ్లి అత్యాచారం
  • కామాంధుడిని చితకబాదిన గ్రామస్తులు

సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ మానసిక వికలాంగురాలిని ఓ కామాంధుడు కాటువేశాడు. వివరాల్లోకి వెళ్తే, బయ్యారం మండలంలోని ఓ గ్రామంలో రాత్రి మానసిక వికలాంగురాలు ఇంటి బయట నిద్రిస్తోంది. రాత్రి 10 గంటల సమయంలో అక్కడకు వచ్చిన ఓ కామాంధుడు ఆమెను బలవంతంగా నిర్జన ప్రదేశానికి ఎత్తుకెళ్లాడు. ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు.

నిద్ర నుంచి మేల్కొన్న కుటుంబసభ్యులు ఆమె కోసం ఇతర గ్రామస్తులతో కలసి గ్రామమంతా వెతికారు. చివరకు గ్రామ శివారులో ఆమె అచేతన స్థితిలో కనిపించింది. ఆ పరిసరాల్లోనే కనిపించిన కామాంధుడిని పట్టుకుని గ్రామస్తులు చితకబాదారు. జరిగిన ఘటనపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు.

More Telugu News