Chatisgarh: ఛత్తీస్ గఢ్ లోని అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల మృతి!

  • దంతరి అటవీ ప్రాంతంలో ఘటన
  • యాంటీ నక్సల్ ఆపరేషన్ లో భాగంగా గాలింపు చర్యలు
  • మృతుల్లో ముగ్గురు మహిళలు 

ఛత్తీస్ గఢ్ లోని దంతరి అటవీ ప్రాంతంలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. యాంటీ నక్సల్ ఆపరేషన్ లో భాగంగా జిల్లాలోని ఖల్లారి-మెచ్కా గ్రామాల మధ్య అడవుల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వీరికి ఎదురుపడ్డ మావోయిస్టులు కాల్పులకు పాల్పడడంతో ఎస్టీఎఫ్ పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ సందర్బంగా మృతి చెందిన నలుగురు మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటవీప్రాంతంలో పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు సమాచారం.

More Telugu News