Ballot: ఇటీవలి సాధారణ ఎన్నికలను రద్దు చేయాలంటూ పిటిషన్.. తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

  • లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలపై దుమారం
  • లోక్‌సభ ఎన్నికలను రద్దు చేయాలన్న ఎంఎల్ శర్మ
  • బ్యాలెట్ పద్ధతిలో తిరిగి నిర్వహించాలంటూ పిటిషన్

ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలపై పెద్ద దుమారమే రేగింది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలంటూ విపక్షాలన్నీ డిమాండ్ చేశాయి. కానీ చివరకు ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికలను రద్దు చేసి తిరిగి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలంటూ న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని జస్టిస్ ఆర్.నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది.

More Telugu News