నేడే కేంద్ర బడ్జెట్... రూపు మారిన బ్రీఫ్ కేస్
- 11 గంటలకు లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
- తొలి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న మహిళా మంత్రి
- పార్లమెంటుకు బయల్దేరిన ఆర్థికమంత్రి
ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి కాసేపటి క్రితం నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు బయల్దేరారు. తొలుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు బడ్జెట్ ప్రతాలను అందజేశారు. మరోవైపు, ఈ సార్ బడ్జెట్ బ్రీఫ్ కేసు మారింది. ఎర్రటి వస్త్రంతో చుట్టిన పార్సిల్ లాంటి దాంట్లో బడ్జెట్ పత్రాలు ఉన్నాయి. దానిపై మూడు సింహాల రాజముద్ర ఉంది. ఈ విధంగా ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయానికి నిర్మలా సీతారామన్ తెరదించారు.