నేడే కేంద్ర బడ్జెట్... రూపు మారిన బ్రీఫ్ కేస్

షార్ట్స్‌లో చూడండి
లోక్ సభలో ఈరోజు ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. మన దేశ చరిత్రలో ఆర్థిక మంత్రిగా ఓ మహిళ ప్రవేశపెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. ఈ బడ్జెట్ లో దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచే అంశాలతో పాటు రైతులు, నిరుద్యోగులకు పెద్ద పీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2023లో జమిలీ ఎన్నికలకు వెళ్లనున్నారనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో, ఈ బడ్జెట్ అందరినీ ఆకట్టుకునే రీతిలో ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి కాసేపటి క్రితం నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు బయల్దేరారు. తొలుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు బడ్జెట్ ప్రతాలను అందజేశారు. మరోవైపు, ఈ సార్ బడ్జెట్ బ్రీఫ్ కేసు మారింది. ఎర్రటి వస్త్రంతో చుట్టిన పార్సిల్ లాంటి దాంట్లో బడ్జెట్ పత్రాలు ఉన్నాయి. దానిపై మూడు సింహాల రాజముద్ర ఉంది. ఈ విధంగా ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయానికి నిర్మలా సీతారామన్ తెరదించారు. 
Go Back to Shorts
Nirmala Seetharaman
Union Budget
Lok Sabha
NDA

More Telugu News