అమరావతికి రూ.2,500 కోట్లు ఇచ్చాం.. పోలవరానికి మరో రూ.6,764 కోట్లు అందించాం!: కేంద్ర ఆర్థిక మంత్రి
- ఏపీ ఆర్థికలోటును తీర్చేందుకు రూ.3,979 కోట్లు అందించాం
- లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని
- లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చిన ఆర్థిక మంత్రి సీతారామన్
ప్రస్తుతం ఎయిమ్స్ తాత్కాలిక క్యాంపస్ లో 2018-19 బ్యాచ్ లో 50 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు చదువుకుంటున్నట్లు సీతారామన్ తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైలును ఏర్పాటు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు ఇంకా అందలేదని స్పష్టం చేశారు. విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని అడిగిన ప్రశ్నలకు సీతారామన్ ఈ మేరకు లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చారు.