galla aruna: అది వైసీపీ విజ్ఞతకే వదిలేస్తున్నాం: గల్లా అరుణ

  • కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది
  • కార్యకర్తలపై దాడి జరిగితే అందరం ఏకమవుతాం
  • జగన్ పాలనకు కొంత సమయం ఇవ్వాలి

ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రజల అవసరాలను తీర్చే విధంగా పాలించాలని టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి గల్లా అరుణ అన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడాన్ని వైసీపీ శ్రేణుల విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలపై దాడి జరిగితే అందరం ఏకమవుతామని తెలిపారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. జగన్ పాలనకు కొంత సమయం ఇస్తే... ఆ తర్వాత ప్రజలే అసలైన తీర్పు ఇస్తారని అన్నారు. తన కుమారుడు గల్లా జయదేవ్ ఎంపీగా గెలిచిన నేపథ్యంలో తెనాలి గంగానమ్మ ఆలయాన్ని దర్శించుకుని, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబు, జయదేవ్ ల గెలుపుతో పాటు టీడీపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అమ్మవారిని గతంలో మొక్కుకున్నానని... అయితే, తీర్పు మాత్రం విచిత్రంగా టీడీపీకి వ్యతిరేకంగా వచ్చిందని చెప్పారు.  

More Telugu News