Hyderabad: నిమ్స్ లో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెస్తాం: మంత్రి ఈటల

  • నిమ్స్ ను పరిశీలించిన ఈటల
  • పాత భవనాలకు మార్పులు చేస్తున్నాం
  • ఉద్యోగుల కొరతను పరిష్కరిస్తాం

హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. నిమ్స్ ను ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, నిమ్స్ లో పాత భవనాలకు మార్పులు చేస్తున్నట్టు చెప్పారు. నిమ్స్ లో నూతన టెక్నాలజీని, పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. త్వరలో ఓపీ బ్లాక్ మరింతగా విస్తరిస్తామని, రోగుల సంఖ్య పెరగడంతో బెడ్స్ కొరత ఉందని, ఈ సమస్యపై దృష్టి సారించినట్టు చెప్పారు. అదేవిధంగా నిమ్స్ లో ఉద్యోగుల కొరత కూడా ఉందని, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు.

More Telugu News