sandeep kishan: ఆ నిర్మాత అలా అనడం వల్లనే నేను నిర్మాతగా మారాను: హీరో సందీప్ కిషన్

  • నా పని అయిపోయిందన్నారు
  •  పట్టుదలతో సినిమా తీశాను 
  • హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్న సందీప్ కిషన్  

తెలుగు తెరపై యువ కథానాయకుడిగా సందీప్ కిషన్ కి మంచి గుర్తింపు వుంది. అయితే కొంతకాలంగా ఆయనకి హిట్లు పడటం లేదు. ఈ నేపథ్యంలో తన సొంత బ్యానర్లో ఆయన 'నిను వీడని నీడను నేనే' అనే సినిమా చేశాడు.

తాజాగా ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ .. "ఆ మధ్య మా మేనేజర్ ఒక నిర్మాతను కలిశారు. మాటల్లో నా ప్రస్తావన వచ్చినప్పుడు ' సందీప్ కిషన్ పని అయిపోయింది కదా .. కొత్త హీరోలు చాలా మందే వచ్చారు .. వాళ్ల గురించి చెప్పండి' అన్నారట ఆ నిర్మాత. ఆయన ఆ మాట అన్నందుకు నాకు కోపం రాలేదు. ఆ మాటలే నన్ను నిర్మాతగా మార్చాయి. అవకాశాలు వెతుక్కుంటూ రావు .. మనమే వాటిని తెప్పించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వుంది" అని ఆయన చెప్పుకొచ్చాడు.

More Telugu News