India: ముస్లిం మహిళలను హిందువులు గ్యాంగ్ రేప్ చేయాలి!: బీజేపీ నేత సునీతా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • మృతదేహాలను చౌరస్తాల్లో వేలాడదీయాలి
  • అప్పుడే ముస్లింలకు బుద్ధి వస్తుంది
  • బీజేపీ యూపీ మహిళా విభాగం చీఫ్ నోటి దురుసు
  • ఫేస్ బుక్ పోస్ట్ వైరల్ గా మారడంతో వేటు వేసిన బీజేపీ

ఉత్తరప్రదేశ్ బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతా సింగ్ గౌర్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారు. ముస్లింలకు బుద్ధి చెప్పాలంటే హిందువులు 10-20 మంది ఓ గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే ముస్లింలకు బుద్ధి వస్తుందని వ్యాఖ్యానించారు. ‘ముస్లింల తల్లులు, చెల్లెళ్లు, అక్కలను గ్యాంగ్ రేప్ చేయండి. వారి శరీర భాగాలను, జననాంగాలను ఛిద్రం చేసి వీధుల చౌరస్తాల్లో మ‌ృతదేహాలను వేలాడదీయండి.  

ఎప్పుడైతే ఈ భయంతో ముస్లిం మహిళలు ఇంటి నుంచి బయటకు రారో, అప్పుడే ఈ ముస్లిం పంది పిల్లలు తమను తాము మార్చుకుంటారు. మనం భారత్ ను కాపాడుకోవాలంటే హిందూ సోదరులు 10-20 మంది ఓ గ్రూపుగా ఏర్పడి ప్రతీ ముస్లిం ఇంట్లో దూరి మహిళలను రేప్ చేయాల్సిందే’ అని పిలుపునిచ్చారు.

ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. చివరికి ఇది బీజేపీ అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో.. ఆమెను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ పోస్ట్ వివాదాస్పదం కావడంతో వాటిని సునీతా సింగ్ తొలగించినప్పటికీ, అప్పటికే స్క్రీన్ షాట్లు వైరల్ అయిపోయాయి.

More Telugu News