Radhika: రాధిక, శరత్ కుమార్ కోర్టుకు గైర్హాజరు... అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు

  • మరో వ్యక్తితో కలిసి రాధిక, శరత్ కుమార్ చిత్రనిర్మాణం
  • రేడియన్స్ మీడియా నుంచి రూ.2 కోట్ల రుణం స్వీకరణ
  • చెక్ ఇవ్వగా బౌన్స్ అయిన వైనం

ప్రముఖ నటి రాధిక, ఆమె భర్త శరత్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. చెక్ బౌన్స్ కేసులో రాధిక, శరత్ కుమార్ కోర్టు గైర్హాజరు కావడంతో న్యాయమూర్తి వారిద్దరినీ అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులకు ఉత్తర్వులు జారీచేశారు. గతంలో, రాధిక, శరత్ కుమార్, లిస్టిన్ స్టీఫెన్ అనే వ్యక్తితో కలిసి చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వారు రేడియన్స్ మీడియా అనే సంస్థ నుంచి రూ.2 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఆ తర్వాత అంతే మొత్తానికి చెక్ ఇవ్వగా అది బౌన్స్ కావడంతో రేడియన్స్ మీడియా కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో భాగంగా రాధిక, శరత్ కుమార్ చెన్నై సైదాపేట కోర్టులో హాజరుకావాల్సి ఉంది. వీరు విచారణకు డుమ్మా కొట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి వారిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను జూలై 12కి వాయిదా వేశారు. దీనిపై రాధిక, శరత్ కుమార్ స్పందించలేదు.

More Telugu News