England: రెచ్చిపోయి సిక్సులు కొడుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్లు... నిస్సహాయుల్లా భారత బౌలర్లు

  • రాయ్, బెయిర్ స్టో అర్ధసెంచరీలు
  • సిక్సులు కొట్టేందుకు పోటీ పడుతున్న వైనం
  • ప్రభావం చూపలేకపోయిన చాహల్, కుల్దీప్

బర్మింగ్ హామ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టో కళ్లు చెదిరే పార్ట్ నర్ షిప్ తో శుభారంభం అందించారు. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై వీరిద్దరూ దూకుడుకే ప్రాధాన్యమివ్వడంతో టీమిండియా బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఎలాంటి బంతివేసినా సిక్సర్ బాదాలన్న కసితో రాయ్, బెయిర్ స్టో ఆడుతుండడంతో స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ రన్ రేట్ ఓవర్ కు 7కి పైగా నమోదవుతోంది.

21 ఓవర్లు ముగిసేసరికి ఆతిథ్య జట్టు స్కోరు వికెట్ నష్టపోకుండా 155 పరుగులు. రాయ్ 63, బెయిర్ స్టో 87 పరుగులతో ఆడుతున్నారు.  ఇద్దరూ కలిసి 8 సిక్సులు, 14 ఫోర్లు బాదారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా ఒక్కడు కాస్త ఫర్వాలేదనిపించగా, స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ ఎలాంటి ప్రభావం చూపించడంలేదు సరికదా, భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. 

More Telugu News