Andhra Pradesh: సానుభూతి పొందాలనుకున్న చంద్రబాబు ప్లాన్ ఎదురుతన్నింది!: విజయసాయిరెడ్డి

  • ప్రజావేదిక ద్వారా సానుభూతి పొందాలనుకున్నారు
  • రేకుల షెడ్డుకు రూ.9 కోట్ల ఖర్చుపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు
  • అమరావతి నిర్మాణంలో అవినీతిపై ఇప్పటికే చర్చ మొదలయింది

ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత ఘటనను వివాదాస్పదం చేసి సానుభూతి పొందాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నించారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్వించారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు, ఆయన ముఠా వేసిన ఎత్తుగడ ఎదురుతున్నిందని వ్యాఖ్యానించారు. కేవలం రేకుల షెడ్డుకు రూ.9 కోట్లు ఎలా ఖర్చు అయిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. రాజధాని వ్యవహారాల్లో ఇంకా ఎంత అవినీతి జరిగిందో అని ప్రజల్లో చర్చ మొదలయిందని పేర్కొన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

More Telugu News