Andhra Pradesh: జూలై 1న ఇంటర్ మార్కుల జాబితాలను విడుదల చేయనున్న ఏపీ ఇంటర్ బోర్డు!

  • జ్ఞానభూమి వెబ్ సైట్ ద్వారా అందుబాటులోకి
  • విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచన
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి అందుబాటులోకి తెస్తామని వ్యాఖ్య

వచ్చే నెల 1వ తేదీ నుంచి జ్ఞానభూమి వెబ్ సైట్ లో ఇంటర్ మార్కుల జాబితాను అందుబాటులో ఉంచుతామని ఏపీ ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మార్కుల జాబితాను విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. జూలై 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డు ఓ ప్రకటనను జారీచేసింది.

More Telugu News