ram: 'ఇస్మార్ట్ శంకర్' నుంచి మనసుకు పట్టేసే పాట

  • పూరి నుంచి రానున్న 'ఇస్మార్ట్ శంకర్'
  • రామ్ సరసన ఇద్దరు నాయికలు
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ 

రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' రూపొందింది. నిధి అగర్వాల్ - నభా నటేశ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక సింగిల్ ను వదిలారు. "ఉండిపో ఉండిపో చేతిలో గీతలా .. ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా .. ఉండిపో ఉండిపో కళ్లలో కాంతిలా .. ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా" అంటూ ఈ పాట సాగుతోంది.

మణిశర్మ కట్టిన బాణీ చాలా బాగుంది. యూత్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఆయన ఈ పాటను స్వరపరిచారు. భాస్కరభట్ల సాహిత్యం బాగుంది. ప్రేమికుల భావజాలాన్ని ఆవిష్కరించడానికి ఆయన అందమైన పదజాలాన్ని అర్థవంతంగా ఉపయోగించాడు. అనురాగ్ కులకర్ణి - రమ్య బెహరా ఈ పాటకి ప్రాణం పోశారు. మొత్తంగా చెప్పాలంటే ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిలా నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

More Telugu News