Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఒక ఊపు ఊపబోతోంది: సినీ నటుడు బాబూమోహన్

  • తెలంగాణలో ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది
  • అప్పటి నుంచి ట్రెండ్ మారిపోయింది
  • ‘బీజేపీలో ఎప్పుడు చేరమంటారు? అంటూ నాకు ఫోన్లు

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పాలక పార్టీలకు బీజేపీయే ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ నేత, సినీ నటుడు బాబూ మోహన్ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుందో అప్పటి నుంచి ట్రెండ్ మారిపోయిందని అన్నారు.

‘బీజేపీలో ఎప్పుడు చేరమంటారు? అంటూ తనకు వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పనైపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అడుగుబొడుగున ఉన్న వాళ్లు కూడా వచ్చి బీజేపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో కూడా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పనైపోయిందని, ‘జగన్ గారొచ్చారు. మంచీ చెడ్డలన్నీ ప్రజలు చూసుకుంటారు’ అని అన్నారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనని, కనుక, భారతీయ జనతా పార్టీ ఒక ఊపు ఊపబోతోందని బాబూ మోహన్ ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News