Guntur District: మంగళగిరిలో టీడీపీ నేత ఉమాయాదవ్ దారుణ హత్య!

  • ఉమా యాదవ్ పై కత్తులతో దుండగుల దాడి
  • తీవ్రంగా గాయపడ్డ ఉమా యాదవ్ మృతి
  • ఓ హత్య కేసులో ఉమా యాదవ్ నిందితుడని సమాచారం

గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం జరిగింది. టీడీపీ నేత ఉమా యాదవ్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఉమా యాదవ్ పై దుండగులు కత్తులతో తీవ్రంగా దాడి చేయడంతో ఆయన మృతి చెందారు. ఓ హత్య కేసులో ఉమా యాదవ్ నిందితుడని సమాచారం. పాతకక్షల నేపథ్యంలోనే ఆయనను హతమార్చినట్టు తెలుస్తోంది. ఈ హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News