Andhra Pradesh: టీడీపీని వీడిన నందమూరి బాలకృష్ణ బంధువు.. బీజేపీ కండువా కప్పిన పురందేశ్వరి!

  • టీడీపీ నుంచి బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు
  • ఆ పార్టీని వీడిన పొట్లూరి కృష్ణబాబు, ఆయన భార్య  
  • బీజేపీలో చేరిన వారిని అభినందించిన పురందేశ్వరి

టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు బంధువు అయిన పొట్లూరి కృష్ణబాబు ఆ పార్టీని వీడారు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. పొట్లూరి కృష్ణబాబు దంపతులు ఈరోజు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో వాళ్లిద్దరూ భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీలోకి వారిని సాదరంగా ఆహ్వానించిన పురందేశ్వరి వారికి అభినందనలు తెలిపారు.

More Telugu News