Meela Satyanarayana: 'సుధాకర్ పైపు'ల సంస్థ అధినేత మీలా సత్యనారాయణ కన్నుమూత

  • అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ
  • చికిత్స పొందుతూ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి
  • పురపాలక సంఘానికి చైర్మన్‌గా పనిచేశారు

వ్యాపార దిగ్గజం, సుధాకర్ పైపుల సంస్థ అధినేత మీలా సత్యనారాయణ నేడు హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గతంలో సత్యనారాయణ సూర్యపేట పురపాలక సంఘానికి చైర్మన్‌గా కూడా పని చేశారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సుధాకర్ పైప్స్ సంస్థకు తెలంగాణా ప్రభుత్వ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు లభించిన సందర్భంగా అప్పుడు రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రిగా ఉన్న కేటీఆర్ ఆయనను సత్కరించారు.

More Telugu News