Chiranjeevi: పోస్ట్ ప్రొడక్షన్ పనులలో 'సైరా'

  • షూటింగ్ పూర్తైందంటూ ప్రకటించిన కెమెరామెన్ రత్నవేలు
  • పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించిన యూనిట్
  • ఆగస్ట్ 22న ట్రైలర్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర కెమెరామెన్ రత్నవేలు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ సినిమా కోసం యూనిట్ సభ్యులు దాదాపు రెండేళ్ల పాటు కష్టపడ్డారు. షూటింగ్ పూర్తి కావడంతో... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీద దృష్టి సారించారు. మరోవైపు ఆగస్ట్ 22న 'సైరా' ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతోంది. 

More Telugu News