Durga Malleswara Swamy: సహస్ర ఘటాభిషేకంతో ముగిసిన వరుణయాగం

  • ఐదు రోజుల పాటు జరిగిన వరుణయాగం
  • కృష్ణా జలాలతో మల్లేశ్వరస్వామికి అభిషేకం
  • రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని యాగం తలపెట్టామన్న అధికారులు

ఈ నెల 20న విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి ఆధ్వర్యంలో ప్రారంభించిన వరుణ యాగం నేటితో ముగిసింది. ఐదు రోజులపాటు జరిగిన ఈ యాగం సోమవారం సాయంత్రం పండితులు, వేదపాఠశాల విద్యార్థుల వేదమంత్రాల నడుమ దుర్గా ఘాట్‌లో సహస్ర ఘటాభిషేకంతో ముగిసింది.

వర్షాలు సమృద్ధిగా కురిసి, రాష్ట్రం పాడిపంటలతో కళకళలాడాలని కోరుతూ తలపెట్టిన ఈ యాగం ముగింపు రోజున కృష్ణా జలాలను తీసుకొచ్చి మల్లేశ్వరస్వామికి పండితులు అభిషేకం చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు తగ్గి, కరవు తొలగిపోయి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ యాగాన్ని తలపెట్టినట్టు స్పష్టం చేశారు.

More Telugu News