Cricket: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ

  • వెంటవెంటనే రెండు వికెట్లు డౌన్
  • సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరిన ఓపెనర్లు
  • హెడింగ్లేలో మ్యాచ్

హెడింగ్లేలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో శ్రీలంక ఆరంభంలోనే రెండు వికెట్లు చేజార్చుకుంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ తీసుకుంది. కానీ ఇంగ్లాండ్ బౌలర్లు కొత్తబంతితో ప్రభావం చూపడంతో ఓపెనర్లిద్దిరూ పెద్దగా పరుగులు చేయకుండానే నిష్క్రమించారు. కెప్టెన్ కరుణరత్నే 1, కుశాల్ పెరెరా 2 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్, వోక్స్ చెరో వికెట్ సాధించారు.

ఈ టోర్నీలో వరుస విజయాలతో ఊపుమీదున్న ఇంగ్లాండ్ మరో గెలుపుతో సెమీస్ అవకాశాలను పటిష్టం చేసుకోవడంపై దృష్టిపెట్టింది. మరోవైపు శ్రీలంక జట్టు ఈ మ్యాచ్ లోనైనా గెలిచి రేసులో నిలవాలని కోరుకుంటోంది. ఇరుజట్ల బలాబలాలు, ఫామ్ రీత్యా శ్రీలంక ఆశలు నెరవేరడం అంత తేలికైన పనికాదని చెప్పాలి. ప్రస్తుతం శ్రీలంక 5 ఓవర్లలో 2 వికెట్లకు 10 పరుగులు చేసింది.

More Telugu News