Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అఖిల్ కథానాయికగా పూజా హెగ్డే?
  • 'ఆర్ఆర్ఆర్' షూటింగులో చరణ్ 
  • 'సాహో'కి తమిళం నుంచి భారీ ఆఫర్  

 *  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని తన తాజా చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయిక పాత్ర కోసం పూజా హెగ్డేను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, పూజా ఇంకా ఈ ప్రాజక్టుకి ఓకే చెప్పలేదు.
*  రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగులో రామ్ చరణ్ సోమవారం నుంచి పాల్గొంటాడు. ఎన్టీఆర్, చరణ్ లపై దర్శకుడు కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరణను ప్లాన్ చేశాడు. హైదరాబాదులో వేసిన సెట్లో వీటిని చిత్రీకరిస్తారు.
*  'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రానికి బిజినెస్ పరంగా ఎంతో క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం తమిళ డిస్ట్రిబ్యుషన్ హక్కుల కోసం 25 కోట్లను ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది.

More Telugu News