Telugudesam: అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసిన సుజనా, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్

  • ఈ ముగ్గురిని అభినందించిన అమిత్ షా
  • రేపు మధ్యాహ్నం ప్రధానిని కలవనున్న నేతలు
  • ఈ భేటీకి అరగంట సమయం కేటాయింపు

ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ లు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. టీడీపీని వీడి బీజేపీలో చేరిన అనంతరం అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరిని అమిత్ షా అభినందించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీతో ఈ ముగ్గురు ఎంపీలు భేటీ కానున్నారు. వీరితో సమావేశానికి సుమారు ముప్పై నిమిషాలు మోదీ కేటాయిస్తారని సమాచారం.

More Telugu News