Andhra Pradesh: త్వరలోనే వెయ్యి 108 అంబులెన్సులు రోడ్ల మీదకు రాబోతున్నాయి!: విజయసాయిరెడ్డి

  • ఎమర్జెన్సీ సేవలకు జగన్ ఊపిరి పోశారు
  • మండలానికో 104 సంచార వైద్యశాల ఏర్పాటు
  • బాబు హయాంలో 108 వాహనాలు మూలన పడ్డాయి

ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర సేవలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్లీ ఊపిరి పోశారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. త్వరలోనే వెయ్యి ‘108 అంబులెన్సులు’ రోడ్లపైకి రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో ఈ 108 వాహనాలు మూలనపడ్డాయని విమర్శించారు. 104 సంచార వైద్యశాలలు నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు. త్వరలోనే మండలానికి ఒకటి చొప్పున 104 సంచార వైద్యశాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

More Telugu News