Mumbai: సీపీఎం నేత కుమారుడిపై అత్యాచారం, మోసం కేసు నమోదు

  • దుబాయ్‌లో బార్ డ్యాన్సర్‌గా పనిచేసిన యువతి
  • బార్‌కు తరచూ వచ్చే బాలకృష్ణన్‌తో పరిచయం
  • యువతి ఫ్లాట్‌కు తరుచూ వెళ్లిన బాలకృష్ణన్
  • ఓ బిడ్డకు జన్మనిచ్చిన బాధితురాలు

పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ మహిళ సీపీఎం నేత కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేరళకు చెందిన సీపీఎం నేత కొడియేరి కుమారుడు వినయ్ వినోదిని బాలకృష్ణన్(37)పై ముంబైలో అత్యాచారం, మోసం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం, ఓ యువతి దుబాయ్‌లో బార్ డ్యాన్సర్‌గా పనిచేసేది. ఆ బార్‌కు తరచూ వెళ్లే బాలకృష్ణన్‌తో పరిచయం, ప్రేమగా మారింది. వివాహం చేసుకుంటానని యువతితో ఉద్యోగాన్ని మానేయాలని సూచించాడు.

2010లో బాధితురాలు ముంబై సబర్బన్ అంధేరీలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని అందులో ఉండేది. ఆ సమయంలో బాలకృష్ణన్ తరచూ ఆమె ఫ్లాట్‌కు వెళ్లి ఉండేవాడు. ఈ క్రమంలో బాధితురాలు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అతనికి అప్పటికే వివాహమైందనే విషయం బాధితురాలికి గతేడాది తెలిసింది. దీంతో వీరి మధ్య గొడవలు జరిగాయి. విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News