Hussain: భార్య తల నరికి.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన భర్త

  • కదిరాయచెరువులో ఉంటున్న హుస్సేన్ దంపతులు
  • భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తన భార్యకు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో సంచలనంగా మారింది. జిల్లాలోని కలకడ మండలం కదిరాయచెరువు గ్రామంలో హుస్సేన్, అమ్మాజీ దంపతులు నివసిస్తున్నారు. అయితే అమ్మాజీకి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో హుస్సేన్ నేడు ఆమె తల నరికి, ఆ తలతో సహా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.

More Telugu News