Cricket: ఆసక్తికరంగా మారిన బంగ్లా, వెస్టిండీస్ మ్యాచ్... గెలిపించేందుకు షకీబల్ పోరాటం

  • సెంచరీకి చేరువలో షకీబల్
  • లిట్టన్ దాస్ సహకారం
  • 33 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసిన బంగ్లా

వెస్టిండీస్ తో టాంటన్ లో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు గెలుపుదిశగా పయనిస్తోంది. ఆల్ రౌండర్ షకీబల్ హసన్ బ్యాటింగ్ నైపుణ్యంతో బంగ్లా జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓ దశలో 133 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బంగ్లా టీమ్ షకీబల్ ధాటిగా ఆడడంతో కోలుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 33 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. షకీబల్ 95 పరుగులతో ఆడుతుండగా, లిట్టన్ దాస్ 40 పరుగులతో అద్భుతమైన సహకారం అందిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలవాలంటే 17 ఓవర్లలో 84 పరుగులు చేయాలి. అంతకుముందు, వెస్టిండీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News