pulwama: పుల్వామాలో మరో ఘాతుకం... ఆర్మీ వాహనంపై పేలుడు పదార్థాలతో ఉగ్రదాడి

  • రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన వాహనంపై దాడి
  • కాల్పులతో పాటు రాళ్లు రువ్విన ముష్కరులు
  • కొనసాగుతున్న ఎన్ కౌంటర్

జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు జరిపిన ఘోర దాడిని ఇంకా మరువక ముందే... ముష్కరులు మరోసారి తెగబడ్డారు. ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా? అనే అంశానికి సంబంధించి ఇంకా సమాచారం వెలువడలేదు. దాడి జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి 27 కిలోమీటర్ల దూరంలో తాజా దాడి జరిగింది.

పుల్వామా జిల్లాలోని అరిహాల్ గ్రామం సమీపంలో ప్రయాణిస్తున్న 44 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన వాహనంపై ఈ దాడి జరిగింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం... ఈ దాడిలో ఒక వాహనం ధ్వంసమైంది. వెంటనే భారీ ఎత్తున కాల్పులు, రాళ్లు రువ్వడం ప్రారంభమైంది. అనంతనాగ్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్మీ మేజర్ ప్రాణాలు కోల్పోయిన గంటల వ్యవధిలోనే... పుల్వామాలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

More Telugu News