KCR: నేడు విజయవాడకు కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌కు ఆహ్వానం

  • మధ్యాహ్నం 12:50 గంటలకు గన్నవరం చేరుకోనున్న కేసీఆర్
  • తాడేపల్లిలో జగన్‌ను కలిసి ఆహ్వానం
  • రాత్రి తిరిగి హైదరాబాద్‌కు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించేందుకు విజయవాడ వెళ్లనున్నారు. విమానంలో మధ్యాహ్నం 12:50 గంటలకు గన్నవరం చేరుకోనున్న కేసీఆర్ విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. 2:30 గంటలకు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి భేటీ అవుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తారు. అక్కడే భోజనం చేసి  సాయంత్రం 5 గంటలకు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లి శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం రాత్రి హైదరాబాదుకు చేరుకుంటారు.

More Telugu News