ఆంధ్రాలో నాటుసారా స్థావరాలను ధ్వంసం చేస్తాం!: ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి
- ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం అమలుచేస్తాం
- ఇందుకోసం కొత్త పాలసీని తీసుకొస్తాం
- అమరావతిలో మీడియాతో ఏపీ ఎక్సైజ్ మంత్రి
అమరావతిలో ఎక్సైజ్ అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల్లోని మద్యం విధానాలను పరిశీలించి కొత్త పాలసీ తీసుకొస్తామని నారాయణ స్వామి తెలిపారు. మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో నాటు సారా స్థావరాలను ధ్వంసం చేస్తామని పేర్కొన్నారు.