Andhra Pradesh: నేను ప్రతిపాదించిన ప్రాజెక్టు అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉంది!: వెంకయ్యనాయుడు

  • కృష్ణపట్నం – ఓబులవారి పల్లె రైల్వేలైన్ ప్రారంభం
  • వాజ్ పేయి హయాంలో ప్రతిపాదించిన వెంకయ్య
  • ఆర్వీఎన్ఎల్, రైల్వే శాఖకు ఉపరాష్ట్రపతి ధన్యవాదాలు

అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో కృష్ణపట్నం – ఓబులవారి పల్లె రైల్వే లైన్ ప్రాజెక్టును తాను ప్రతిపాదించానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్), రైల్వే శాఖలకు అభినందనలు చెప్పారు.

ఈ లైన్ లో రైల్వేశాఖ డీజిల్ ఇంజిన్ తో ట్రయల్ రన్ నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ నెల 20 నుంచి ఈ రూట్ లో ఎలక్ట్రిక్ రైలు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. తాను ప్రతిపాదించిన ప్యాసింజర్ రైలును త్వరితగతిన ఏర్పాటు చేసినందుకు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థకు మరోసారి ధన్యవాదాలు చెప్పారు.

More Telugu News