Telangana: తెలంగాణలో ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు చేపడతాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

  • దేవాలయాల లీజ్ భూములపై దృష్టి సారిస్తాం
  • ఆలయాల్లో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు  
  • అందుకు, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాం

తెలంగాణలోని ఆలయాల్లో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపట్టాలని చూస్తున్నామని, అందుకు, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దేవాదాయ శాఖపై ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. అలాగే, వసతి గృహాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామని అన్నారు. ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు చేపడతామని, దేవాలయాల లీజ్ భూములపై దృష్టి సారిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News