సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కోరా!: అమిత్ షాతో భేటీపై జగన్

  • సహాయ సహకారాలు కోరా
  • ప్రత్యేక హోదా కోరుతూ లేఖను అందించా
  • ఇప్పటికే నివేదిక కూడా సిద్ధం
ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతతో పాటు విభజన చట్టంలోని అంశాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వివరించినట్టు ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. అమిత్‌షాతో భేటీ ముగిసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నందున సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కోరినట్టు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రాసిన లేఖను అమిత్‌షాకు అందించినట్టు జగన్ తెలిపారు. రేపు జరగబోయే నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలోనూ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తనున్నట్టు జగన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశంపై వివరించేందుకు ఇప్పటికే నివేదికను కూడా జగన్ సిద్ధం చేయించారు.
Go Back to Shorts
Jagan
Amith Shah
Special Status
Neeti Ayog
Letter

More Telugu News