KCR: మహారాష్ట్ర సీఎంని కలసిన కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం

  • ఫడ్నవీస్‌ను శాలువాతో సన్మానించిన కేసీఆర్
  • మహారాష్ట్ర సహకారం మరువలేనిదని వెల్లడి
  • ఒప్పందం కారణంగానే త్వరితగతిన పూర్తి
తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమయ్యారు. నేటి ఉదయం ముంబై చేరుకున్న కేసీఆర్ తొలుత మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో భేటీ అయ్యారు. అనంతరం సీఎం ఫడ్నవీస్‌‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్ర సహకారం మరువలేనిదని, ఆ రాష్ట్రంతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగానే త్వరితగతిన పూర్తయిందని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఫడ్నవీస్‌ను శాలువాతో సన్మానించారు. జయశంకర్ భూపాలపల్లిలోని కన్నెపల్లి వద్ద నిర్మితమైన ఈ ప్రాజెక్టును ఈ నెల 21న ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనున్నారు.
KCR
Devender Fudnavis
Mumbai
Vidyasagar Rao
Kaleswaram Project

More Telugu News