Cricket: కష్టాల్లో విండీస్... 55 పరుగులకే 3 వికెట్లు డౌన్

  • టాస్ గెలిచిన ఇంగ్లాండ్
  • విండీస్ కు బ్యాటింగ్ అప్పగింత
  • కనిపించని వరుణుడు!

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఎట్టకేలకు ఓ మ్యాచ్ సాఫీగా ఆరంభమైంది. ఇప్పటికే పలు మ్యాచ్ లు వరుణుడి ఆగ్రహానికి గురికాగా, సౌతాంప్టన్ లో ఇవాళ ఇంగ్లాండ్, వెస్టిండీస్ మ్యాచ్ పైనా అనుమాన మేఘాలు ముసురుకున్నాయి. అయితే, ఆకాశం మేఘావృతమై ఉన్నా వర్షం కురవకపోవడంతో మ్యాచ్ నిర్ణీత సమయానికే ఆరంభమైంది.

ఇక, ఈ పోరులో ఆతిథ్య ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన విండీస్ 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 4 పరుగుల స్కోరు వద్ద ఓపెనర్ ఎవిన్ లూయిస్ అవుట్ కాగా, క్రిస్ గేల్ 36 పరుగులు చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. కాస్సేపటికే షై హోప్ కూడా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం విండీస్ స్కోరు 15 ఓవర్లలో 3 వికెట్లకు 60 పరుగులు. క్రీజులో నికోలాస్ పూరన్, షిమ్రోన్ హెట్మెయర్ ఉన్నారు.

More Telugu News