Andhra Pradesh: బొబ్బిలి కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. ఇద్దరు దుర్మరణం, 10 మందికి తీవ్రగాయాలు!

  • విజయనగరం జిల్లాలోని బొబ్బిలిలో ఘటన
  • ఒక్కసారిగా పేలిపోయిన బాయిలర్
  • ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఈరోజు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బొబ్బిలి పారిశ్రామికవాడలో ఉన్న బాలాజీ కెమికల్స్ లో ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో ఏర్పాటుచేసిన బాయిలర్ ఒక్కసారిగా పేలిపోయింది.

ఈ దుర్ఘటనలో బొబ్బిలి మండలానికి చెందిన జగదీశ్, బాడంగి మండలానికి చెందిన సురేష్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. మరో 10 మందికి తీవ్రగాయాలు కాగా, వీరిని తోటి కార్మికులు హుటాహుటిన బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసిన బొబ్బిలి పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News