ORR: ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరి మృతి

  • తుక్కుగూడ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ప్రమాదం
  • మృతి చెందిన మాధవరెడ్డి, రఘుమారెడ్డి
  • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

హైదరాబాద్ఔ పరిధిలోని టర్ రింగ్ రోడ్డులో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. తుక్కుగూడ వద్ద గల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో యాచారానికి చెందిన మాధవరెడ్డి, రఘుమారెడ్డి అనే వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News