England: ఇంగ్లండ్‌లో టోర్నీలు నిర్వహించకుండా బ్యాన్ చేయండి: శశిథరూర్

  • వర్షం కారణంగా మూడు మ్యాచ్‌లు రద్దు
  • ఇంగ్లండ్‌లో వేసవి కాస్తా వర్షాకాలంగా మారుతోందన్న థరూర్
  • అప్పటి వరకు ఇంగ్లండ్‌ను నిషేధించాల్సిందేనన్న కాంగ్రెస్ నేత

క్రికెట్ టోర్నీలు నిర్వహించేందుకు ఇంగ్లండ్ అనువుగా లేదని, మరోమారు ఇటువంటి టోర్నీలు నిర్వహించకుండా ఆ దేశంపై నిషేధం విధించాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ డిమాండ్ చేశారు. ప్రపంచకప్‌లో భాగంగా జరగాల్సిన మూడు మ్యాచ్‌లు వర్షార్పణం కావడంపై స్పందించిన థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇంగ్లండ్‌లో వేసవి కాస్తా క్రమంగా వర్షాకాలంగా మారుతోందని థరూర్ పేర్కొన్నారు. క్రికెట్ టోర్నీలు నిర్వహించేందుకు ఇంగ్లండ్ పనికిరాదని, కాబట్టి మరోమారు ఇటువంటి టోర్నీలు నిర్వహించకుండా ఐసీసీ అడ్డుకోవాలని కోరారు.  వాతావరణ మార్పులను ప్రపంచం పరిష్కరించేంత వరకు ఆ దేశంపై నిషేధం విధించాలని, లేదంటే కవర్డ్ స్టేడియాలను ఐసీసీ నిర్మించాలని శశిథరూర్ సూచించారు.  

More Telugu News