Andhra Pradesh: ఏపీ శాసన సభాపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

  • నామినేషన్ దాఖలు చేసిన తమ్మినేని
  • శాసనసభ కార్యదర్శికి నామినేషన్ పత్రాల సమర్పణ
  • లాంఛనప్రాయం కానున్న తమ్మినేని ఎన్నిక

ఏపీ శాసనసభాపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇప్పటికే శాసనసభాపతి గా ఖరారైన తమ్మినేని సీతారాం తన నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ కార్యదర్శికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా, శాసనసభాపతిగా తమ్మినేని ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. రేపు ఉదయం తొమ్మిది గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ నాయకుడు తమ్మినేని సీతారాం. ఆముదాలవలస నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటివరకూ 6 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు మంత్రిగా ఆయన పని చేశారు.   

More Telugu News