bobby: మెగా హీరో సినిమాతో నిర్మాతగా మారుతోన్న మరో దర్శకుడు

  • 'వెంకీమామ'తో బాబీ బిజీ
  •  మారుతి దర్శకత్వంలో తేజు 
  • తరువాత ప్రాజెక్టుగా బాబీ - తేజు మూవీ

తెలుగులో చాలామంది దర్శకులు నిర్మాతలుగా మారిపోయారు. కొంతమంది తమ సినిమాలను తామే నిర్మిస్తుంటే, మరికొందరు ఇతర హీరోల సినిమాలకి కూడా నిర్మాతలుగా మారుతున్నారు. అలా నిర్మాతలుగా మారిన దర్శకుల జాబితాలో తాజాగా బాబీ కూడా చేరిపోయాడు.

ఆయన నిర్మాణంలో సాయిధరమ్ తేజు హీరోగా ఒక సినిమా రూపొందనున్నట్టుగా సమాచారం. ఈ సినిమాకి అరుణ్ పవార్ దర్శకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం మారుతితో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి తేజు సిద్ధమవుతున్నాడు. 'వెంకీమామ' సినిమాతో బాబీ బిజీగా వున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టుగా బాబీ - తేజు సినిమా ఉంటుందని అంటున్నారు. త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి.

More Telugu News