kodela: కోడెలను చేసిన పాపాలు వెంటాడుతున్నాయి... ఇందులో కక్ష సాధింపు లేదు: ఏపీ మంత్రి గౌతంరెడ్డి

  • గత ఎన్నికల్లో కూడా కోడెల హింసకు పాల్పడ్డారు
  • కోడెల కుటుంబానికి ఇలాంటివి కొత్త కాదు
  • చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సిందే

మాజీ స్పీకర్ కోడెల చేసిన పాపాలు కేసుల రూపంలో ఆయనను వెంటాడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతంరెడ్డి అన్నారు. కోడెలపై ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపులకు పాల్పడటం లేదని చెప్పారు. గత ఎన్నికల్లో కూడా కోడెల హింసకు పాల్పడ్డారని అన్నారు. కోడెల కుటుంబానికి ఇలాంటివి కొత్త కాదని అన్నారు. చట్టపరమైన చర్యలను కోడెల కుటుంబం ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు.

More Telugu News