prabhas: 'సాహో' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు

  • 300 కోట్లతో రూపొందుతోన్న 'సాహో'
  • ఈ నెల 13వ తేదీన టీజర్ విడుదల
  •  ఆగస్టు 15వ తేదీన సినిమా రిలీజ్

 ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' రూపొందుతోంది. 300 కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. హాలీవుడ్ సినిమాలకి పనిచేసిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేస్తున్నారు. అందువలన ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఈ నేపథ్యంలో వస్తోన్న టీజర్ ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి మరి.

More Telugu News