India: నిన్నటి మ్యాచ్ లో ఆసీస్ అభిమానులు ఎక్కడ?: మైఖేల్ వాన్

  • పెద్దగా కనిపించని ఆసీస్ ఫ్యాన్స్
  • ట్విట్టర్ వేదికగా మైఖేల్ వాన్ ఎద్దేవా
  • తమకు ఎన్నో క్రీడలున్నాయంటున్న ఆసీస్ ఫ్యాన్స్

ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతోందంటే... ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఫ్యాన్స్ తరలివచ్చి, స్టేడియాన్ని నింపేస్తుంటారు. అలాగే ఆస్ట్రేలియాలో కూడా క్రీడాభిమానులు క్రికెట్ పేరు చెబితే పరుగులు పెడతారు. ఇక ఈ రెండు దేశాల మధ్య పోటీ అంటే, రెండు దేశాల అభిమానులతో స్టాండ్స్ నిండిపోతుంటాయి.

కానీ నిన్న లండన్ లోని ఓవెల్ మైదానంలో వరల్డ్ కప్ గ్రూప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఆసీస్ అభిమానులు చాలా పలుచగా కనిపించారు. మైదానమంతా ఇండియా అభిమానులతోనే కిక్కిరిసిపోగా, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ వాన్‌ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ట్వీట్ చేశారు. మైదానమంతా వెతుకగా, ఆటగాళ్లు, వారికి మద్దతిచ్చే స్టాఫ్ తో కలిసి ఓ 33 మందికి మించి లేరని ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ వైరల్ కాగా, తమ దేశంలో క్రికెట్ తో పాటు చాలా క్రీడలున్నాయని ఆసీస్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. టికెట్లు దొరకలేదని కొందరు వ్యాఖ్యానించారు. వాన్ ట్వీట్ చూసిన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం భారత సత్తా ఇదని అంటున్నారు.

More Telugu News