teja: మహేశ్ బాబుతో ఎలాంటి గొడవ జరగలేదు: దర్శకుడు తేజ

  •  'నిజం' చాలా మంచి సినిమా'
  • 'ఒక్కడు' ముందుగా రిలీజ్ అయింది
  • మహేశ్ ఇమేజ్ మారిపోయింది

తెలుగు తెరకి ప్రేమకథా చిత్రాలను కొత్త కోణంలో పరిచయం చేసిన దర్శకుడు తేజ. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'నిజం' సినిమాను గురించి ప్రస్తావించారు. "మహేశ్ బాబుతో నేను చేసిన 'నిజం' చాలా విభిన్నమైన సినిమా. అయితే ఈ సినిమాకంటే ముందుగా మహేశ్ చేసిన 'ఒక్కడు' విడుదలైంది.

దాంతో ఒక్కసారిగా మహేశ్ బాబు ఇమేజ్ మారిపోయింది. అందువల్లనే ఆ తరువాత వచ్చిన 'నిజం' సినిమాలో మహేశ్ బాబును నేను చూపించినట్టుగా చూడలేకపోయారు. మహేశ్ బాబు ఇమేజ్ కథకి అడ్డం పడటం వల్లనే ఆ సినిమా పరాజయంపాలైంది. ఈ సినిమా సమయంలో మహేశ్ బాబుతో నాకు గొడవైందనే వార్త అప్పటి నుంచి కూడా అక్కడక్కడా వినిపిస్తూనే వుంది. నిజానికి ఆయనకీ .. నాకు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు .. రావు" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News