మా నాయకుడు జగన్ బాటలో నడుస్తూ ప్రజలకు సేవ చేస్తా!: మంత్రి పుష్ప శ్రీవాణి
- ఈరోజు మంత్రిగా ప్రమాణస్వీకారం
- కురుపాం నుంచి గెలుపొందిన శ్రీవాణి
- ఎస్టీ మహిళ కోటాలో వరించిన పదవి
2014 ఎన్నికల్లో కేవలం 27 ఏళ్ల వయసులో ఆమె వైసీపీ తరఫున బరిలోకి దిగి 19,083 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించారు. దీంతో ఎస్టీ మహిళా కోటాలో ఆమెను మంత్రి పదవి వరించింది. పుష్ప శ్రీవాణి ప్రస్తుతం జియ్యమ్మ వలస మండలంలోని చినమేరంగి కోటలో నివాసం ఉంటున్నారు.