Andhra Pradesh: కొత్త కేబినేట్: తొలుత ప్రమాణ స్వీకారం చేసిన ధర్మాన

  • గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం
  • బొత్స, పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్, సీఎస్ ఎల్వీ  

ఏపీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. గవర్నర్ నరసింహన్ సమక్షంలో మొట్టమొదట ధర్మాన కృష్ణ ప్రసాద్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత, బొత్స సత్యనారాయణ, పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన మంత్రులతో ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, పలువురు ప్రభుత్వ అధికారులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.

More Telugu News